Category: తెలంగాణ స్టేట్

ఖమ్మం  3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

ఖమ్మం విఎన్బి న్యూ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 4 ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. సోమవారం…

ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలు ఏకాగ్రీవంగా ఎన్నుకున్న బోయపాటి కృష్ణకుమారి

ఖమ్మం మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలలో ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడినారు అందులో కొమ్ము మధు కుమార్13 ఓట్లు,దగ్గు శ్రీనివాసరావు 282 ఓట్లుషేక్ జానీ బాబు 10,సుంకి…

పోల్లేపల్లి రాజీవ్ గృహ కల్పన ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంలో ఉండేందుకు ఉద్యోగ సంఘ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంగా ఉండేందుకు( TGE HEIGHTS)ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నిర్ణయం: ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 3 తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాలు, తమ…

జర్నలిస్టులకి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి దండి సురేష్

జర్నలిస్టులకు సిపిఐ అండగా ఉంటుంది సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ను సన్మానించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఖమ్మం ఆగస్టు o3 మన జ్యోతి బ్యూరో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు…

ఎదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన విజయవంతం

ఏదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం ఖమ్మం రూరల్ (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 )) వెంపటి నాయుడు మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఎస్ విజయ్ గారు మాట్లాడుతూ ఏధిలాపురం మున్సిపాలిటీలో…

9 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్

తొమ్మిదేళ్ళ బాలికపై ఐదుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఒక కాలనీలో కొడుకు, ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్న దంపతులు మూడు రోజుల క్రితం తండ్రి పని మీద బయటికి వెళ్లగా, అనారోగ్యంతో బాధపడుతున్న…

ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 01 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం, ఆగస్టు 1:ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని…

ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు

సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం…..మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31 భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు…

పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 27.)) వెంపటి నాయుడు 🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఖమ్మం, భద్రాద్రి…

దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ పై వీడియో కాన్ఫెరెన్స్. అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పి.హెచ్.సి.లలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ సిబ్బందికి జిల్లాలో వర్షాకాలం మరియు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారించాల్సిన చర్యలపట్ల రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అనేక సలహాలు, సూచనలు, కీటక జనిత వ్యాధుల పట్ల నివారణ చర్యలను వివరించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ, మురికినీటి కాలువలు, గుంటలు, మోరీలతో పాటు మంచినీటి ఆవాసాలలో కూడా దోమలు పెరిగి వ్యాధిల్ని కలగజేస్తాయని, ముఖ్యంగా డెంగీ వ్యాధిని కల్గించే ఆడ ఏడిస్ ఈజిప్టి సాధారణంగా కృత్రిమ కంటైనర్ల లోపలి గోడలపై గుడ్లు పెడుతుంది. కంటైనర్లు నీటితో నిండినప్పుడు, దోమల లార్వా గుడ్ల నుండి పొదుగుతుంది. నాలుగు లార్వా దశలను దాటిన తర్వాత, లార్వా ప్యూపాలుగా రూపాంతరం చెందుతుంది. అవి కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం లేదా డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది శిశువులు, చిన్న పిల్లలు మరియు పెద్దలకు కూడా డెంగీ జ్వరం సోకుతుంది.అనారోగ్యం, తేలికపాటి జ్వరం నుండి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పి మరియు దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్లలో రక్తస్రావం, అలసట, వాంతిలో రక్తం పడడం వుంటుంది. డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలు : ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నుండి రక్షించడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేసిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, వారానికి తప్పకుండా రెండుసార్లు డ్రై డే పాటించడం లాంటి చర్యలను నిరంతరం చేయాలనీ, మీ వాటర్ ట్యాంక్ లేదా బకెట్లను ఎల్లప్పుడూ నీటితో కప్పండి. ముఖ్యంగా దోమల బెడద ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంటే, కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి. తలుపులు, కిటికీలకు దోమ తెరలు వాడడం,పొడవాటి ప్యాంటు, కూడిన షర్టులను ధరించాలి. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నీటి తొలగింపు (De-watering) మరియు లార్వా నిర్మూలన (Anti-Larval Operations) కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, నీటి ట్యాంకులు, బావులు మరియు ఇతర దోమల పెంపక కేంద్రాలలో కీమోపాస్ (రసాయన లార్విసైడ్) వాడకం ద్వారా లార్వాలను నిర్మూలించడం చేపట్టాలని, డా. అమర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి ఈరోజు సందర్బంగా డాక్టర్లకు డెంగీ వ్యాధిని నివారించడంలో ముందుండాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. వెంకట రమణ, డా. చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You missed