ఖమ్మం ఫిబ్రవరి 20 *(( మన జ్యోతి

బ్యూరో వెంపటి నాయుడు *))


ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల శ్రీమతి మరముల్ల ప్రియాంక (W/O) రాంబాబు 12/06/2025 న వాంతులు , విరేచనాలు వంటి లక్షణాలతో కండర బలహీనత వల్ల మలకపేటలో యశోదా హాస్పిటల్ లో చేరారని వెంటనే సమగ్ర రక్తపరీక్షలు , బయోకెమికల్ మూల్యాంకనం మరియు బహుళ విభాగాల వైద్యుల పరిశీలన అనంతరం మొదట బయట హైవికలేమియా గా గుర్తించి అధునాతన చికిత్స కోసం అడ్మిట్ అయ్యారని పేర్కొన్నారు . ఆసుపత్రిలో చేరిన సమయంలో తీవ్రమైన పోటాషియం లోపం మరియు శారీరక అస్థిరత గమనించబడిందని అన్నారు . తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు మరియు ఆటోఇమ్యూన్ సంబంధిత మెటబాలిక్ వ్యాధులు సకాలంలో చికిత్స చేయకవిత ప్రాణాపాయ స్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది . ముఖ్యంగా హైపోకలోమిక్ పీరియాడిక్ ప్యారాలిసిస్ వంటి వ్యాధులు మూత్రపిండ సమస్యలు మరియు ఆటోఇమ్యూన్ రుగ్మతలతో కలిసివస్తే నరాల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు . ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందస్తు గుర్తింపు , సమగ్ర వైద్య మూల్యాంకనం మరియు బహుళ విభాగాల సమన్వయంతో కూడిన చికిత్స అత్యంత అవసరమన్నారు . హైపోకలేమిక్ పీరియాడిక్ పెరాలిసిస్ మెరుగుదలలో ప్రైమరీ షోన్స్ సిండ్రోమ్ , డిస్టల్ రీనల్ ట్యూబ్యులర్ అసిడోసిస్ , సెంట్రల్ ఫౌంటైన్ మైలినోలిసిస్ , కొత్తగా ప్రారంభమైన సిక్స్ హైపర్కలేమియా సరిచేయబడింది . రోగిని అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షించే విభాగంలో ఉంచి , నియంత్రిత విధానంలో విటాషియం స్థాయిలను సరిచేయడం , ఎలక్ట్రోలైట్ సమతుల్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ , ఆకస్మిక మార్పులు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము . చికిత్సలో భాగంగా తీవ్రమైన హైపోకలేమియా నియంత్రితంగా సరిచేయడం , సీల్డ్స్ నియంత్రణకు యాంటీ ఎపిలెప్టిక్ మందులు , రీనల్ ట్యూబ్యులర్ ఆసిడోసిస్ కు తగిన చికిత్స ప్రైమరీ షోన్స్ సిండ్రోమ్కు ఇమ్యూనోథెరపీ , చికిత్స సమయంలో వచ్చిన హైపర్కలేమియాను వెంటనే గుర్తించి సరిచేయడం , న్యూరాలజీ , నెఫ్రాలజీ , రుమటాలజీ , క్రిటికల్ కేర్ , జనరల్ మెడిసిన్ తదితర విభాగాల వైద్యులు సమన్వయంతో చికిత్స అందించము . క్రమంగా రోగిలో కండర బలం మెరుగుపడి , ఏటాషియం స్థాయిలు స్థిరపడ్డాయి . హైపోకలేమిక్ పీరియాడిక్ ప్యారాలిసిస్ ప్రాణాపాయ స్థితికి దారితీసి వ్యాధి . తీవ్ర పొటాషియం లోపం వల్ల అకస్మాత్తుగా కండర బలహీనత మరియు శ్వాస సమస్యలు రావచ్చు . ముఖ్యంగా ఆటోఇమ్యూన్ మరియు మూత్రపిండ సంబంధిత కారణాలను గుర్తించడం అత్యంత కీలకం . సకాలంలో ఎలక్ట్రోలైట్ సరిచేయడం మరియు బహుళ విభాగాల సమన్వయం ఈ కేసులో కీలక పాత్ర పోషించాయి అని అన్నారు . ఫలితంగా ఆసుపత్రి చికిత్స సమయంలో రోగి స్థిరంగా కోలుకుని , కండర బలం మెరుగుపడి , ఎలక్ట్రోలైట్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరి 18/06/2025న రోగిని స్థిర స్థితిలో డిశ్చార్జ్ చేసి , ఔషధాలు , ఆహార నియమాలు మరియు క్రమమైన ఫాలోఅప్ సూచనలు ఇచ్చాము . ఈ కేసు యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మలకపేట లో అందుబాటులో ఉన్న అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణులు మరియు 24 గంటల క్రిటికల్ కేర్ సేవల సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పిందని అన్నారు .

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed