ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6

26 నుండి భారత్ గౌరవ్ రైలు యాత్ర
సామాన్యులకు అందుబాటులో ధరలు
సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సిటిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పివి వెంకటేష్
ఖమ్మం, అక్టోబర్ 6 ః
ఈ నెల 26 నుండి నవంబర్ 4 వరకు తెలుగు ప్రజల కోసం ప్రత్యేక పర్యాటక రైలు (భారత్ గౌరవ్ రైలు) అందుబాటులో ఉందని, ఖమ్మం ప్రజలు వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్
(ఐఆర్సిటిసి) టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం యాత్ర వివరాలు వెల్లడించారు. ఈ తీర్ధయాత్రలో భాగంగా ద్వారకాదీప్ మందిరం, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరం, భేట్ ద్వారక, సోమనాధ్
జ్యోతిర్లింగ మందిరం, సబర్మతి ఆశ్రమం, సూర్యదేవాలయం, రాణికి వావ్, సర్దార్ వల్లాభాయ్
పటేల్ విగ్రహం తదితర ప్రదేశాల సందర్శన ఉంటుందని తెలిపారు. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక్కొక్కరికి స్లీపర్ 18400, 3ఏసి 30200, 2ఏసి 39900 రూపాయల టికెట్ ధర ఉంటుందన్నారు. ఈ ప్యాకేజీలో మూడు పూటల భోజన వసతి, రవాణా సౌకర్యాలు, ప్రతి కోచ్లో ఐఆర్సిటిసి సిబ్బంది అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 97013 60701, 92810 30711, 92810 30749, 92814 95845, 92814 95843 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టూరిజం మోడివేటర్లు ప్రశాంత్, జయంతి పాల్గొన్నారు.
