ఖమ్మం ఆగస్టు 28 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))


కమ్యూనిటీ హల్ కు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలి.
జిల్లా కలెక్టర్ కు మున్నూరుకాపు సంఘ నాయకుల వినతి
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న మున్నూరుకాపు సంఘం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ ను కలిసి అసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా అసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మాట్లాడుతూ…
గత ఏడాది సెంప్టెంబర్ లో ఖమ్మం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తమ కమ్యూనిటీ హల్ నిర్మాణ అభివృద్ధికి గాను ఎంపీ ల్యాడ్స్ కింద 50 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు.మంజూరు చేసిన నిధుల ఉత్తర్వులను విడుదల చేసి శిథిలవస్థ లో ఉన్న కమ్యూనిటీ హల్ నిర్మాణ
అభివృద్ధి కి సహకరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ ను కలిసిన వారిలో అసంఘం సీనియర్ నాయకులు పసుపులేటి దేవేందర్,శీలం శెట్టి వీరభద్రం,చామకూరి వెంకన్న ఉన్నారు.
