తిరుమలాయపాలెం ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.
— పారదర్శకంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి
— సామాన్యుడు చేతిలో వజ్రాయుధం ఆర్టిఐ చట్టం,
— సమాచార హక్కుల కమిషన్, పి వి. శ్రీనివాసరావు.
తిరుమలాయపాలెం, ఆగస్టు 03 (( మన జ్యోతి ప్రతినిధి ))

తిరుమలాయపాలెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ పి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ కృపఉష డిప్యూటీ డిఎం & హెచ్ వో, ఇతర అధికారులతో, ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి అక్కడికక్కడే వైద్యం అందించాలని సూచించారు సిబ్బందితో డాక్టర్ చందు నాయక్ జరిగిన ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రంలోని పరిశుభ్రత, ఔషధ నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా సమాచార హక్కుల కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య హక్కు రాజ్యాంగపరమైన హక్కు. ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తమ హక్కులను తెలుసుకొని పోరాడాలి అన్నారు.అలాగే, సాధారణ పౌరుడు ప్రభుత్వ సేవలపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నాడని, ప్రజా వ్యవస్థలపై ప్రజల నిఘా తప్పనిసరి అని స్పష్టం చేశారు.తనిఖీ అనంతరం మండల ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్,. రికార్డులు, ప్రజల ఫిర్యాదుల ప్రాసెసింగ్, ఖాళీ పోస్టుల భర్తీ, మందుల సరఫరా వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు సేవలందించడంలో ఆలస్యం చేయవద్దని హెచ్చరించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కమిషనర్ పర్యటనపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, న్యూ డెమోక్రసీ నాయకులు కే నాగేశ్వరరావు, మేకల చంద్రశేఖర్, దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు
