*చోరీ కేసులో మహిళా దొంగ అరెస్ట్, చోరీ సొత్తు రికవరీ

పాలేరు (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 6 ))
తిరుమలాయ పాలెం మండల కేంద్రంలో మే 23 న పగిళ్ల రామకృష్ణ ఇంట్లో దొంగతనం జరిగి బంగారం, వెండి వస్తువులు ( బంగారపు నెక్లెస్ -1, ఉంగరాలు -2, చెవిదిద్దులు -2, మాటీలు -2, ఒక జత వెండి పట్టీలు, వెండి మొలత్రాడు -1) సుమారుగా లక్ష రూపాయల విలువ గల బంగారు, వెండి వస్తువులు దొంగిలించబడినవి. అట్టి నేరానికి పాల్పడిన డోర్నకల్ మండలానికి చెందిన మహిళను పట్టుకొని విచారించగా, తనే చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో ఆమె వద్ద నుండి బంగారం, వెండి వస్తువులు రికవరీ చేయడం జరిగింది. ఆమెను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టు నందు హాజరుపరచడమైనది.
యస్సై
తిరుమలాయ పాలెం.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed