ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పారదర్శికంగా వైద్య సేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వెంకటరమణ, డా. చందు నాయక్, డా. రామారావు, డా. సుబ్బారావు, డా. బిందుశ్రీ, డెమో సుబ్రహ్మణ్యం, ఐ.ఎం.ఏ. డాక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Post navigation
దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ పై వీడియో కాన్ఫెరెన్స్. అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పి.హెచ్.సి.లలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ సిబ్బందికి జిల్లాలో వర్షాకాలం మరియు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారించాల్సిన చర్యలపట్ల రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అనేక సలహాలు, సూచనలు, కీటక జనిత వ్యాధుల పట్ల నివారణ చర్యలను వివరించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ, మురికినీటి కాలువలు, గుంటలు, మోరీలతో పాటు మంచినీటి ఆవాసాలలో కూడా దోమలు పెరిగి వ్యాధిల్ని కలగజేస్తాయని, ముఖ్యంగా డెంగీ వ్యాధిని కల్గించే ఆడ ఏడిస్ ఈజిప్టి సాధారణంగా కృత్రిమ కంటైనర్ల లోపలి గోడలపై గుడ్లు పెడుతుంది. కంటైనర్లు నీటితో నిండినప్పుడు, దోమల లార్వా గుడ్ల నుండి పొదుగుతుంది. నాలుగు లార్వా దశలను దాటిన తర్వాత, లార్వా ప్యూపాలుగా రూపాంతరం చెందుతుంది. అవి కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం లేదా డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది శిశువులు, చిన్న పిల్లలు మరియు పెద్దలకు కూడా డెంగీ జ్వరం సోకుతుంది.అనారోగ్యం, తేలికపాటి జ్వరం నుండి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పి మరియు దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్లలో రక్తస్రావం, అలసట, వాంతిలో రక్తం పడడం వుంటుంది. డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలు : ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నుండి రక్షించడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేసిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, వారానికి తప్పకుండా రెండుసార్లు డ్రై డే పాటించడం లాంటి చర్యలను నిరంతరం చేయాలనీ, మీ వాటర్ ట్యాంక్ లేదా బకెట్లను ఎల్లప్పుడూ నీటితో కప్పండి. ముఖ్యంగా దోమల బెడద ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంటే, కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి. తలుపులు, కిటికీలకు దోమ తెరలు వాడడం,పొడవాటి ప్యాంటు, కూడిన షర్టులను ధరించాలి. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నీటి తొలగింపు (De-watering) మరియు లార్వా నిర్మూలన (Anti-Larval Operations) కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, నీటి ట్యాంకులు, బావులు మరియు ఇతర దోమల పెంపక కేంద్రాలలో కీమోపాస్ (రసాయన లార్విసైడ్) వాడకం ద్వారా లార్వాలను నిర్మూలించడం చేపట్టాలని, డా. అమర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి ఈరోజు సందర్బంగా డాక్టర్లకు డెంగీ వ్యాధిని నివారించడంలో ముందుండాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. వెంకట రమణ, డా. చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.