ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

42వ డివిజన్ నిజాంపేట్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
3 స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం…….

42 డివిజన్లోని నిజాంపేట ప్రాంతంలో త్రీ స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తుంబురు దయాకర్ రెడ్డి,
TRR Ortho యాక్సిడెంట్ కేర్ ప్రముఖ వైద్యులు
MS Ortho సర్జన్
Dr. తోట లక్ష్మణ్,
ఎక్స్ కార్పొరేటర్
తోట రామారావు పాల్గొని ఆ అమ్మవారి మండపంలో పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా
తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మండపాల వద్ద జరిగే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నవరాత్రులకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాగంగా అమ్మవారి మండపాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితన కార్యక్రమాలు నిర్వహించడాన్ని హర్షించారు. ఇటువంటి సేవ దృక్పధ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని వారు వారి కుటుంబాల సుఖశాంతులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

Dr. తోట లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మనమందరం భక్తి పర్వంతో కుంకుమ పూజ అన్న ప్రసాద వితరణ శోభాయాత్ర, నిర్వహించుకోవడం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున శోభ తీసుకొస్తాయని మా హాస్పిటల్ ఉన్న
నిజాంపెట్ ప్రాంతంలో మండపాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని. మీ ఉత్సవ కమిటీ సభ్యులకు నేనెప్పుడూ అందుబాటులో అండదండగా ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ,
తోట రమేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed