Month: July 2025

ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు

సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం…..మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31 భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు…

పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 27.)) వెంపటి నాయుడు 🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఖమ్మం, భద్రాద్రి…

దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ పై వీడియో కాన్ఫెరెన్స్. అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పి.హెచ్.సి.లలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ సిబ్బందికి జిల్లాలో వర్షాకాలం మరియు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారించాల్సిన చర్యలపట్ల రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అనేక సలహాలు, సూచనలు, కీటక జనిత వ్యాధుల పట్ల నివారణ చర్యలను వివరించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ, మురికినీటి కాలువలు, గుంటలు, మోరీలతో పాటు మంచినీటి ఆవాసాలలో కూడా దోమలు పెరిగి వ్యాధిల్ని కలగజేస్తాయని, ముఖ్యంగా డెంగీ వ్యాధిని కల్గించే ఆడ ఏడిస్ ఈజిప్టి సాధారణంగా కృత్రిమ కంటైనర్ల లోపలి గోడలపై గుడ్లు పెడుతుంది. కంటైనర్లు నీటితో నిండినప్పుడు, దోమల లార్వా గుడ్ల నుండి పొదుగుతుంది. నాలుగు లార్వా దశలను దాటిన తర్వాత, లార్వా ప్యూపాలుగా రూపాంతరం చెందుతుంది. అవి కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం లేదా డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది శిశువులు, చిన్న పిల్లలు మరియు పెద్దలకు కూడా డెంగీ జ్వరం సోకుతుంది.అనారోగ్యం, తేలికపాటి జ్వరం నుండి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పి మరియు దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్లలో రక్తస్రావం, అలసట, వాంతిలో రక్తం పడడం వుంటుంది. డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలు : ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నుండి రక్షించడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేసిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, వారానికి తప్పకుండా రెండుసార్లు డ్రై డే పాటించడం లాంటి చర్యలను నిరంతరం చేయాలనీ, మీ వాటర్ ట్యాంక్ లేదా బకెట్లను ఎల్లప్పుడూ నీటితో కప్పండి. ముఖ్యంగా దోమల బెడద ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంటే, కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి. తలుపులు, కిటికీలకు దోమ తెరలు వాడడం,పొడవాటి ప్యాంటు, కూడిన షర్టులను ధరించాలి. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నీటి తొలగింపు (De-watering) మరియు లార్వా నిర్మూలన (Anti-Larval Operations) కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, నీటి ట్యాంకులు, బావులు మరియు ఇతర దోమల పెంపక కేంద్రాలలో కీమోపాస్ (రసాయన లార్విసైడ్) వాడకం ద్వారా లార్వాలను నిర్మూలించడం చేపట్టాలని, డా. అమర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి ఈరోజు సందర్బంగా డాక్టర్లకు డెంగీ వ్యాధిని నివారించడంలో ముందుండాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. వెంకట రమణ, డా. చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలిజిల్లా అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ ఐ.డి.ఓ.సి. ప్రాంగణంలోని ప్రగతి మీటింగ్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతోపి.సి.పి.ఎన్‌.డి.టి.యాక్ట్, ఎమ్‌.టి.పి యాక్ట్, బర్త్ & డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు, రోగుల భద్రత, రక్షణ, నిర్వహణ, రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో వైద్య ఆరోగ్య సంబంధిత సేవలను కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు అమలు చేయడానికి,గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం మరియు గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం నకు జిల్లాలో ఛైర్మన్ గా వున్నారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును నిరంతరం పరిశీలించాలని, గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్దారణ చట్టం-1994, రూల్స్‌-1996 అమలు గురించి ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశవుగా వున్నపుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. ఆసుపత్రులలో ‘ఇచట లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు, సేవ్ గర్ల్ చైల్డ్ ‘ పోస్టర్లు అందరికి కనపడే విధంగా ప్రదర్శిస్తున్నారా, లేదా అని పరిశీలించాలని అన్నారు. స్కానింగ్‌ సెంటర్లలో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ వుండాలని, ప్రతినెల జరిగే స్కానింగ్‌ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలని, ఆన్లైన్ పోర్టల్ లో కూడా నమోదు చేయాలనీ, లింగ నిర్ధారణ, పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయేది ఆడ మగ అని చెప్పడం, సంకేతాలు చూపెట్టడం కూడా నేరమని, జిల్లాలో 0-6 సంవత్సరాల వయసు గల ఆడపిల్లల శాతం క్రమక్రమంగా దిగజారిపోతున్నదని, అందుకు నైతిక, సామాజిక బాధ్యత అందరికి వర్తిస్తుందని, ఆసుపత్రుల నిర్వహణలో నాణ్యత, భద్రత, లైసెన్సులు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రత, మొదలైనవి చాలా ముఖ్యమైనవని, ఆసుపత్రులు సరైన ప్రమాణాలతో పనిచేస్తున్నాయా, లేవా, నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు చేపట్టాలని,ఆసుపత్రిలో అందించే వైద్య సేవల నాణ్యతలను,వైద్యుల నైపుణ్యతలను, రోగుల సంరక్షణ, చికిత్సా,ఆసుపత్రికి సరైన లైసెన్సులు ఉన్నాయా,లేవా , ఆసుపత్రికి గుర్తింపు వుందా, లేదా,అగ్నిమాపక భద్రత, వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రత వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలనీ,ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో నిర్వహించడం, తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడటం,రోగులకు సరైన చికిత్స అందించడం, వారి భద్రతను నిర్ధారించడం, ప్రమాదాలు జరగకుండా చూడటం,ఫార్మసీలో మందుల నిల్వ, గడువు తేదీలు, సరైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయా? లేదా? ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్‌లకు సరైన రిజిస్ట్రేషన్ ఉందా, లేదా,వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు, పనితీరును తనిఖీ చేయాలని,ఆసుపత్రి యాజమాన్యం ఈ నియమాలను పాటిస్తూ, లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, జిల్లాలో 519 హాస్పటల్స్ రిజిస్ట్రేషన్ అయి వున్నాయని, సాధారణ ప్రసవలు జరిగేలా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి ప్రజలకు ఉచిత వైద్య సేవలను శాంతి నిలయం లేదా కర్ణగిరి లలోఅందించాలని,

ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పారదర్శికంగా వైద్య సేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వెంకటరమణ, డా. చందు నాయక్,…

ముఖ్యమంత్రి మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారితో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ తో

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ….. సీఎం రేవంత్ రెడ్డి *భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడాలి *పిడుగుపాటు వల్ల మానవ, పశువు ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు…

ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునీకరణ పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి

సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి…

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి  అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ రావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్…

సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు రోజులపాటు మదిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభం లో జన్మించారు విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు

సిజ్ చేసిన ఇసుక “మాయా”జాలం.

#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్‌ చేసిన డంపులూ మాయం..# వేలంపాటరోజే అధికారులకు ఝలక్. సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు. *తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 )) పట్టుబడిన ఇసుక డంప్ లు…

You missed