ఖమ్మం, మే 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001, మే 31న అల్లం నారాయణ సార్ సారధ్యంలో ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరం’గా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని 2001 నుండి 2014 వరకు అనేక పోలీస్ కేసులు, లాఠీ దెబ్బలు, జైలు పాలైన్నప్పటికీ పోరాటం ఆపకుండా తెలంగాణను సాదించుకున్నాం అన్నారు. తెలంగాణ సాధించుకున్న జర్నలిస్టు సంఘంగా టీజేఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో శనివారం జరిగే టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్నలిస్టులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం టీజేఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్న జర్నలిస్టు సంఘంగా టీజేఎఫ్ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. టిజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ సార్ సారధ్యంలో తెలంగాణ జర్నలిస్టులకు నలభై కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మరణించిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, భార్యలకు పెన్షన్, చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం ఇలా జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. అనంతరం జర్నలిస్టులు రజతోత్సవ సభలను జయప్రదం చేయాలని ఖమ్మం పట్టణంలో ప్రెస్ క్లబ్ నుండి పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, బైపాస్ రోడ్డు, డిఆర్డీఏ, బస్ డిపో మీదుగా మయూరి సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరును. జర్నలిస్టులు సమయపాలన పాటించి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు వెన్నెబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, జిల్లా నాయకులు విజేత, మందటి వెంకటరమణ, మందుల ఉపేందర్, అమరవరపు కోటేశ్వరరావు, కాపర్తి నరేందర్, టీఎస్ చక్రవర్తి, శ్రీధర్ శర్మ, తిరుపతిరావు, ఉత్కంఠం శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీషా అశోక్, పాశం వెంకటేశ్వర్లు, హుస్సేన్, కొరకొప్పుల రాంబాబు, ముత్యాల కోటేశ్వరరావు, బిక్కి గోపి, మూల జీవన్ రెడ్డి, మోహన్, కిరణ్, సాయి, ఏబీఎన్ సాయి, పానకాలరావు, పులి శ్రీను, నల్లమోతు శ్రీనివాస్, వెంకట కృష్ణారావు, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, సునీల్, యాదగిరి, గిరి, వెంపటి నాయుడు, పెంటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


