ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు

  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వెంకటగిరి ప్రాంతంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్, చింతపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… వెంకటగిరి లో రూ. 2 కోట్ల 55 లక్షల రూపాయలతో చేపట్టిన మిని స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. తాజాగా రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయలతో 33/11 కె వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసు కున్నామని అన్నారు.

ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో ఒక కోటి 10 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి ఖమ్మం – వరంగల్ హై వే రోడ్డు నిర్మాణానికి, ఒక కోటి 43 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి తిరుమలాయపాలెం – ఆరేకోడు బీటీ రోడ్డు నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గడిచిన ఇరవై నెలల కాలంలో ఇందిరమ్మ రాజ్యంలో చింతపల్లి గ్రామానికి దాదాపు రూ. 24 కోట్ల 74 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేశామని అన్నారు.

గ్రామంలో బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, పెండింగ్ ఉన్న రోడ్లు, పాఠశాల అభివృద్ధి పనులకు నిధులను విడతల వారిగా మంజూరు చేసి పూర్తి చేసే బాధ్యత తనదని మంత్రి తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు అందించే అవకాశాన్ని పరిశీలించి అర్హులకు చేరేలా చూడాలని మంత్రి రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ 200 యూనిట్ల ఉచితవిద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహాయం 12 వేలకు పెంపు, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు సొంతిల్లు అందించే పథకం నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు.

అనంతరం 56 మందికి కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ రాం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed